హలో,
ఎలా వున్నారు ? అంతా బావున్నారా ? సారీ అండి ఇన్నాలు డుమ్మా కొట్టాను .అయినప్పట్టికి ఎంతో బాగా నా బ్లాగ్ ని ఆదరించారు. అందుకు నా థాంక్స్. ఇకమీదట్నుంచి ఎప్పటికప్పుడు మీతో నా బ్లాగ్ తో టచ్ లో ఉండాలనుకుంటున్నా.
మరి, ఇవ్వాల్టి నా టాపిక్ ఏంటో తెలుసా? అదేనండి, ఎంతటి వారినైనా తన స్వరాల మంత్రాలతో మాయ చేసే పాడుతా తియ్యగా ప్రోగ్రాం గురించి. ఈ ప్రోగ్రాం విన సోంపు గ వుంటుంది. అంతే కాదు ఈ ప్రోగ్రాం ఎంతో బంధాలను కూడా గట్టిపడుస్తుంది. అదేనండి ఎంతో మంది ఈ ప్రోగ్రాంని చూస్తువుంటే బంధువుల్లో వున్నా భాంధవ్యాలను కూడా గుర్తుచేస్తుంది ఈ చక్కటి ప్రోగ్రాం.ఈ ప్రోగ్రాం ని ఎవ్వరు చూసినా క్షణం లోనే ఈ ప్రోగ్రాం 'మన చుట్టాల్లో ఎవరికీ ఇష్టమో చెప్పు' అని అడిగి ఇలాంటి చిన్న చిన్నచిలిపి చిలిపి ప్రశ్నలకు పాడుతా తీయగా ప్రోగ్రాం ఒక బాంధవ్యాలను కలిపే వేదికగా నిలిచింది. ఈ విదంగా పిల్లల దగ్గర్నుంచి పెద్దవాల వరుకు అందరిని ఆకర్షిస్తుంది ఈ ప్రోగ్రాం.
ఇక ఈ ప్రోగ్రాం ని చూసి ఎంతో మంది చిన్నపిల్లలకి కూడా సంగీతం నేర్చుకోవాలన్న ఆత్రుత కూడా కలిగిమ్పచేస్తుంది . ఈ ప్రోగ్రాం ద్వారా సంగీతం మీద మక్కువ మాత్రమే కాకుండా ఎంతో మందికి చదువు కూడా చాల ముఖ్యమన్న విషయం ఈ ప్రోగ్రాం ని మొదటినుంచి నిర్వహిస్తున్న బాలు గారు ఎప్పటిక్కప్పుడు తెలుపుతూనే వున్నారు.
- నాగ సాయి రమ్య
All the best for your blog ramya gaaru.
ReplyDeletethanks
Delete